ఇష్టరాజ్యాంగ రోడ్డు పనులు - రైతులకు ఇబ్బందులు.
By
Rathnakar Darshanala
ఇష్టరాజ్యాంగ రోడ్డు పనులు - రైతులకు ఇబ్బందులు.
ఇబ్బందులు పడుతున్న రైతులు.
మోకాళ్ళలోతు దిగపడుతున్న రోడ్డు.
నేటివార్త, జూలై 26, తాండూర్:
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చూలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డు గత సంవత్సరం ప్రారంభించారు.ఇందులో భాగంగా రోడ్ పనులు చేపట్టకుండా కేవలం అచ్చూలాపూర్ వద్ద ఒక కల్వర్టు మాత్రమే నిర్మించారు.
ఈ కల్వర్టు పనులు కూడా ఇష్టారాజ్యంగా చేయడంతో ఇప్పుడు అసలు వర్షాకాలం పంటల సీజన్ లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు నిర్మాణం కోసం తోడిన మట్టిని కల్వర్టు లోనే వేయడంతో వర్షానికి వచ్చే వరద నీటితో కాలువ మూసుకుపోయి.ఆగిన నీళ్లు వెనక పొలాల్లోకి వెళ్తున్నాయి.
రోడ్డు పైన కూడా గట్టి మొరం వేయకుండా తీసిన మట్టితోనే నింపడంతో అటువైపు వెళ్ళే రైతులు మోకాళ్ల లోతు బురదలో నడవాల్సిన పరిస్థితి తయారైంది.
బురదలో మనుషులు నడవాలంటేనే కష్టంగా ఉన్న ఈ రోడ్డు పైన పంట పొలంలకు మందు బస్తాలు మోసుకుంటూ తీసుకెళ్లాలంటే రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎడ్ల బండ్లు నడవలేని పరిస్థితి,రోడ్డు పక్కనున్న పొలాల గట్లు కూడా తీసి మళ్లీ పునరుద్ధరించకపోవడంతో రైతులే మళ్లీ సొంత ఖర్చులతో పనులు చేయించుకుంటున్నారు.
రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పంట పొలాలకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం. వ్వవసాయ భూమిలోకి పంట సామాగ్రి తీసుకుపోవాలంటే కష్టంగా ఉంది.
ఇప్పటికైన సంబంధిత అధికారులు రోడ్డు వేసి రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments