పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీల నిరసన – ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు.

Rathnakar Darshanala
పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీల నిరసన – ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు.
నేటి వార్త జులై 28 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ

పార్లమెంట్ గేటు ముందు ఎన్నికల అనంతరం కుట్రపూరితంగా ప్రవేశపెట్టిన ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఐడెంటిఫికేషన్ రివిజన్) విధానంపై కాంగ్రెస్ పార్టీ ఘాటైన నిరసన తెలిపింది. 

జాతీయ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ నేతృత్వంలో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ గేట్ ఎదుట గళమెత్తారు.

ఎందుకు నిరసన..?

ప్రజల అభిప్రాయం లేకుండా, ఓటర్ల జాబితాలను మత-కుల ప్రాతిపదికన వడపోసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. 

ఈ చర్యను ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా విమర్శించారు.

వంశీకృష్ణ  వ్యాఖ్యలు:

"ఇది ఓటర్లను వర్గీకరించే కుట్ర. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బహిరంగ పోరాటం కొనసాగిస్తాం!"

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు:

"ఓటర్లను తీసేయడం కాదు, వారి గొంతుక వినడం ప్రభుత్వ బాధ్యత!"

ఒక గంటపాటు కొనసాగిన ఈ నిరసనలో మీడియా, ప్రజలు విస్తృతంగా స్పందించారు. వంశీకృష్ణ ధైర్యవంతమైన పోరాటం, ప్రియాంక గాంధీ నేతృత్వం కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Comments