ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు.
By
Rathnakar Darshanala
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు.
( నేటి వార్త) నార్నూర్
ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ప్రజల వద్ద డబ్బులు వసులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నార్నూర్ సిఐ ప్రభాకర్ హెచ్చరించారు.
గాదిగూడ మండలానికి చెందిన బాధితుడు హెరకుమ్ర వినోద్ కుమార్ నివాసం రాంపూర్ మరియు మడావి శ్రీరాం నివాసం లోకారి బి ఇచ్చిన పిర్యాదు మేరకు,
అరే ప్రవీణ్ సంజయ్ నగర్,ఆదిలాబాద్ అనే వ్యక్తి రిమ్స్ ఆదిలాబాద్ యందు నేను ఆఫీసర్ అని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఏడాది క్రితం 1250000 వేల రూపాయలు వసులు చేసినట్టు వారు తెలిపారు.
అలాగే మడవి శ్రీరాం నుండీ ST కార్పొరేషన్ నుండీ ఉద్యోగం ఇప్పిస్తానని Rs 1,90,000/- తీసుకున్నాడు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తేలిపారు.
కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. అక్రమ వసూళ్ళు, మోసపురిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments