నకిలీ ఆయుర్వేదిక్ వైద్యం తో మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - జిల్లా ఎస్పీ.

Rathnakar Darshanala
నకిలీ ఆయుర్వేదిక్ వైద్యం తో మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - జిల్లా ఎస్పీ.
 *9 మంది పై ఆదిలాబాద్ లో ఇప్పటివరకు 8 కేసులు నమోదు, 8 మంది అరెస్టు*

 *ప్రధాన నిందితునికి పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు.* 

 *ఆరు ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు స్వాధీనం*

 *పదివేల నగదు స్వాధీనం, బ్యాంకు నందు 23 వేల నగదు సీజ్.* 

 *అనారోగ్యంతో ఉన్న వారిని పట్టణంలో మరియు హాస్పటల్ వద్ద, షాపింగ్ కాంప్లెక్స్ ల వద్ద గమనించి మొసానికి పాల్పడుతున్న ముఠా*

 *ఇదివరకే ఇతర జిల్లాలలో మోసానికి పాల్పడిన ముఠా సభ్యులు.* 

 *ఆయుర్వేద వైద్యం పేరుతో అనారోగ్యం నయమవుతుందని నమ్మబలికి బాధితుల వద్ద నకిలీ ఆయుర్వేదం మందులు అందజేసి డబ్బులు లూటీ.* 

*బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ లో ఐదు, టూ టౌన్ లో ఒకటి, మావలా లో రెండు కేసులు నమోదు.* 

 *చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, అనారోగ్యులు టార్గెట్ గా ముఠా సభ్యుల మోసాలు.* 

 *8 కేసులలో 9 మందిపై చీటింగ్ కేసు నమోదు.* 

 *పాత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ.*

నేటి వార్త ఆదిలాబాద్ :

 *ముఠా సభ్యుల వివరాలు*
A1.కుమార్ @ బాబా (పరారీ)
వయస్సు: 66 సంవత్సరాలు,
గుల్బర్గా, కర్ణాటక.
A2.శేఖర్ రెడ్‌లైన్ s/o రాజేష్
వయస్సు: 27 సంవత్సరాలు
నివాసం: ఘజీపూర్, 
A3.పెంద్రే కుమార్ s/o దుర్గప్ప
వయస్సు: 29 సంవత్సరాలు
నివాసం: ఉగర్ ఖుర్ద్, కర్ణాటక
A4.గోలార్ సంతోష్ s/o పరశురామ్
వయస్సు: 32 సంవత్సరాలు
నివాసం: ధారవాడ్, కర్ణాటక
A5.కొండంగల్ అమ్రేశ్ s/o శంకర్
వయస్సు: 28 సంవత్సరాలు
నివాసం: గుల్బర్గా, కర్ణాటక
A6.గోలార్ ఆనంద్ s/o రాము
వయస్సు: 32 సంవత్సరాలు
నివాసం: హుబ్లీ, ధారవాడ్, కర్ణాటక
A7.యలిగర్ హజ్రత్ s/o మక్తూమ్
వయస్సు: 42 సంవత్సరాలు
నివాసం: గోకాక్ గ్రామం, బేలగావి జిల్లా, కర్ణాటక
A8.నాగేష్ s/o స్వామప్ప
వయస్సు: 19 సంవత్సరాలు
నివాసం: గుల్బర్గా, కర్ణాటక
A9.అనిల్ కుమార్ s/o వెంకటేష్
వయస్సు: 28 సంవత్సరాలు
నివాసం: గుల్బర్గా, కర్ణాటక

ఆదిలాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మందుల దుకాణం పేరుతో ముఠా నిర్వహిస్తున్న అక్రమాలపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్  మహాజన్ ఐపిఎస్ పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 

*ఈ ముఠా చేసే మోసం* 

ఈ ముఠా సభ్యులు విడివిడిగా విడిపోయి కొందరు ఆదిలాబాద్ పట్టణంలో  మరియు పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ వద్ద, పలు సూపర్ మార్కెట్ల వద్ద అనారోగ్యంతో ఉన్న బాధితులను అందులో ముఖ్యంగా చిన్నపిల్లలను మహిళలను మరియు వృద్ధులను గ్రహించి వారిని సంప్రదించి తమ కుటుంబ సభ్యులకు సైతం ఇదేవిధంగా సమస్య ఉండేదని,

 దానికి ఒక ఆయుర్వేద బాబా ద్వారా తమ సమస్యలకు అనారోగ్య సమస్యలు నయం అయి, పూర్తి అయోగ్యంగా పరిష్కారం లభించిందని తెలిపి వారి వద్దనుండి మొబైల్ నెంబర్లను సేకరించి కీలక ప్రధాన సూత్రధారి అయిన A1 *కుమార్ @ బాబా* కు  అందజేయడం జరుగుతుంది. 
తదుపరి సాయంత్రం ముఠా లో కీలక సభ్యుడైన కుమార్ @ బాబా వారికి ఫోన్ ద్వారా సంప్రదించి తాను ఒక ఆయుర్వేద వైద్యుడునని వివరాలను, సమస్యలను తెలుసుకుని ఈ సమస్యలకు పరిష్కారం ఉందని నమ్మబలికి, 

తన యొక్క కుమారులను పంపిస్తానని చెప్పి ఆదిలాబాద్ లో ఉన్న తన ముఠా సభ్యులను వారి ఇంటికి పంపి ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక మిశ్రమాన్ని తయారుచేసి ఈ మిశ్రమానికి మావల పోలీస్ స్టేషన్ పరిధిలో బాబా కు సంబంధించిన ఒక ఆయుర్వేదిక్ దుకాణంలో లభిస్తాయని నమ్మబలికి, 

వారిని వెంట పట్టుకొని ఐదు గ్రాములు, 10 గ్రాములు సంబంధించిన నకిలీ మూలికలను, ఒక గ్రాము 5000 - 10000 చొప్పున బాధితులకు అమ్మి, లక్షలలో దండుకోవడం మోసం చేయడం వీరి ముఠా చేస్తున్న అక్రమ దందా.

వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా తెలిపారు. వీరందరూ ఇదివరకే  సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలలో ఇలాంటి మోసాలకు పాల్పడి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మోసాలకు పాల్పడడం జరిగిందని తెలిపారు.

 తదుపరి ఇతర జిల్లాకు వెళ్లకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అడ్డగించి వారి అక్రమాలను బట్టబయలు చేసిందని తెలిపారు. 

ప్రజలు ఎలాంటి బాబాలను మూఢనమ్మకాలను నమ్మకుండా గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్సను తీసుకోవాలని సూచించారు.

గుర్తింపు పొందిన ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా చికిత్సను పొందాలని ఇలాంటి మందులను వాడటం వల్ల తమ ఆరోగ్యం మరింత చెడిపోయి అనారోగ్య బారిన పడతారని విషయాన్ని గ్రహించాలని సూచించారు.

ఈ ముఠా సభ్యులపై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు, టూ టౌన్ లో ఒకటి, మావలాలో రెండు కేసులు నమోదు అయ్యాయని, తెలిపారు వీరందరిపై బిఎన్ఎస్ 318(4), 316 తో కేసు నమోదు అయిందని తెలిపారు.

ఈ ముఠా సభ్యులను ఈరోజు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో 8 మందిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వివరించారు. ఈ ముఠా సభ్యులలో కీలక నిందితుడి పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

 ఈ కీలక నిందితుడు వీరందరికీ నకిలీ పేర్లతో మొబైల్ ఫోన్ లను మరియు సిమ్ కార్డులను అందజేయడం జరుగుతుందని, తదుపరి ఈ మొబైల్ ఫోన్ లను సిమ్ములను నాశనం చేయడం జరుగుతుందని తెలిపారు. 

కలిసికట్టుగా ప్రజలను మోసగించి సంపాదించిన  డబ్బులను వారందరూ పంచుకునేవారుగా తెలియజేశారు. 

ఈ ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్న ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సై నాగనాథ్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ పత్రికా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, కె స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments