ADB :మహారాష్ట్ర దేశిదారు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.
By
Rathnakar Darshanala
మహారాష్ట్ర దేశిదారు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.
నేటి వార్త ఆదిలాబాద్ :
మహారాష్ట్ర కనికి నుండి భీంపూర్ మండలం పాక్డిగూడ గ్రామానికి అక్రమంగా తెలంగాణలో నిషేధిత దేశదారును తీసుకువచ్చి అమ్ముతున్నరన్న విశ్వసనీయ సమాచారం మేరకు,
జైనథ్ సిఐ డి.సాయినాథ్, ఎస్ఐ పీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ గంగారెడ్డి, మధుకర్ లతో కలిసి మహారాష్ట్ర కనికి నుండి అక్రమంగా మోటార్ సైకిల్ పై దేశీదారు తీసుకు వస్తున్న తొడ్సం వెంకట్రావు,
ఆత్రం మోతీరామ్ లను శనివారం సాయంత్రం లింగూడ గ్రామ శివారులో అదుపులో తీసుకొని వారి వద్ద నుండి (50) దేశిధారు బాటిల్లను సీజ్ చేయడం జరిగింది.
మరియు దేశిదారు తరలించడానికి ఉపయోగించిన బైకును కూడా సీజ్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టవద్దని , జిల్లాలో ఎక్కడ దేశిధారు ,పేకాట,మట్కా, గుట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,
అట్టి వారిపై ఉక్కుపాదం మోపాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచనల మేరకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిఘా పటిష్టం చేసినట్లు డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూనట్లు జైనధ్ సిఐ డి.సాయినాథ్ తెలిపారు.
దేశిదారు అమ్ముటకు తరలిస్తున్న ఇద్దరిని చాకచక్యంగా పట్టుకున్న జైనథ్ సి.ఐ డి.సాయినాథ్, ఎస్ఐ పీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ గంగారెడ్డి, మధుకర్ లను డిఎస్పీ జీవన్ రెడ్డి అభినందించారు.
మండలంలో ఎక్కడైనా దేశీధారు, పేకాట, మట్కా,గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం (జైనథ్ సి.ఐ 8712659916, భీంపూర్ ఎస్ఐ 8712659931లకు) ఇవ్వగలరని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సి.ఐ డి.సాయినాథ్ తెలిపారు.
Comments