జీవో నెంబర్ 49 నిలుపుదల కంటి తుడుపు చర్య ---ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.

Rathnakar Darshanala
జీవో నెంబర్ 49 నిలుపుదల కంటి తుడుపు చర్య ---ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
 
నేటి వార్త జూలై 22 కాగజ్ నగర్; 

ఆదివాసుల హక్కులు కాలరాస్తున్న జీవో నెంబర్ 49 నిలుపుదల కేవలం కంటి తుడుపు చర్యగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అభివర్ణించారు. 

మంగళవారం కాగజ్ నగర్ పట్టణం లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవో నెంబర్ 49 శాశ్వత రద్దు జరిపే వరకు తమ పోరాటం కొన సాగుతుందని ఆయన తెలిపారు. 

ఆదివాసి సంఘాలు, బాజాప, ప్రజా సంఘాలు సోమవారం నిర్వహించిన బంద్ సంపూర్ణం కావడంతో ప్రభుత్వం దిగివచ్చి ఈ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసింది అన్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే జీవో నెంబర్ 49 జారీ చేశామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం జీవో తాత్కాలిక నిలుపుదల ఆర్డర్స్ ఇవ్వడానికి కేంద్రాన్ని సంప్రదించారా. 

కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వుల వలన వారే నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారన్నారు.

 జీవో నెంబర్ 49 శాశ్వత రద్దు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపుఇస్తామన్నారు.

 ఈ నెలాఖరు వరకు జీవును రద్దు చేయని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వరరావు, సిద్ధం శ్రీనివాస్, 

బాల్క శ్యామ్, మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, సాంబయ్య, గణపతి లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments