ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేత గా శ్రీరాంపూర్ జట్టు.
By
Rathnakar Darshanala
ఫుట్ బాల్ టోర్నమెంట్ విజేత గా శ్రీరాంపూర్ జట్టు.
మందమర్రి టౌన్.
మందమర్రి :ఏరియా సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో రెండు రోజుల నుండి జరుగుతున్న కంపెనీ లెవెల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారం రోజున ముగింపు దశకు చేరుకుంది .
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా పర్సనల్ మేనేజర్. ఎస్. శ్యామసుందర్ పాల్గొన్నారు అతను మాట్లాడుతూ ముందుగా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల అందరికీ అభినందనలు తెలిపారు .
క్రీడల్లో
గెలుపు ఓటములు సహజమని
క్రీడాకారులు ఇలాంటి కంపెనీ లెవల్లో మీ ఆటను ప్రదర్శించి మీ ఏరియా కు విజయం సాధించాలని అన్నారు.
అనంతరం ఈ కంపెనీ లెవెల్ ఫుట్ బాల్ టోర్న మెంట్ లో విన్నర్స్ గా నిలిచిన శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులకు మొదటి బహుమతి రన్నర్ గా నిలిచిన జీడికే-1&2 క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
విన్నర్స్ గా గెలిచిన శ్రీరాంపూర్ ఏరియా వారిని అభినందిస్తూ కోల్ ఇండియా స్థాయిలో గెలుపొంది సింగరేణికి మంచి పేరును తీసుకురావాలని వారికి తెలియజేశారు.
అలాగే ఈ కంపెనీ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను ఈ రెండు రోజులు చక్కటి ఏర్పాట్లను చేసినటువంటి మందమర్రి ఏరియా గౌరవ కార్యదర్శి, కోఆర్డినేటర్, ఆర్గనైజర్స్ ను మరియు స్పోర్ట్స్ సూపర్వైజర్ లను అభినందించారు.
ఈ కార్యక్రమంలోAITUC బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ మరియు దాగం మల్లేష్, CMOAI అధ్యక్షులు రమేష్,
WPS &GA గౌరవ కార్యదర్శి కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నేట్ , స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ,
Ch.అశోక్, H.రమేష్, P. శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ S. శివ కృష్ణ , జనరల్ క్యాప్టన్ సాక శ్రీనివాస్ మరియు అన్ని ఏరియాల క్రీడాకారులు, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments