ఎన్నికల నియామవాలి అతిక్రామిస్తే కఠిన చర్యలు తప్పవు.

Rathnakar Darshanala
ప్రచారానికి తెర అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు*

*ఎస్ఐ దాస సుధాకర్*

నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ నవంబర్ 28

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5గంటలతో ప్రచారానికి తెర పడిందని,ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రచారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్ఐ దాస సుధాకర్ హెచ్చరించారు.

ప్రచారం గడువు ముగియడంతో పోస్టర్లు,బ్యానర్లు,స్టిక్కర్లు,కండువాలు వేసుకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 30వ తేదీన ఎలక్షన్ ముగిసేంత వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

ఈ సమయంలో లౌడ్ స్పీకర్లు పెట్టడానికి అనుమతి లేదని,నాన్ లోకల్ వ్యక్తులు ఉండడానికి వీలులేదని అన్నారు. ఎన్నికల నిబంధనలతో పాటు ఇతర ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments