చట్ట సభల్లో వెనుక బెంచ్ లో కూర్చుని,సమస్యలపై ప్రశ్నించే దమ్ము లేని వారికి ఓటు వేయకండి.. జూలకంటి రంగన్న.

Rathnakar Darshanala
చట్ట సభల్లో వెనుక బెంచ్ లో కూర్చుని,సమస్యలపై ప్రశ్నించే దమ్ము లేని వారికి ఓటు వేయకండి.. జూలకంటి రంగన్న*

*-పల్లెల్లో కమ్యూనిస్టులకు పూర్వ వైభవం అడుగడుగునా జనహారతులు* 

*-నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన చరిత్ర నీకుందా...?అది రంగన్నకు ఉంది* 
 *-రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్* 

వేములపల్లి, నవంబర్ 14(నేటి వార్త):
గత పది సంవత్సరాలలో మిర్యాలగూడ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన చరిత్ర నీకు ఉందా.. అని అది రంగన్నకే సాధ్యమని ఆల్ ఇండియా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు.

                         సోమవారం మండలంలో
మిర్యాలగూడ సిపిఐఎం ఎమ్మెల్యే  అభ్యర్థి జూలకంటి రంగన్న  మండలంలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, అమనగల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకరం చుట్టారు. ఎన్నికల్లో ప్రతి గ్రామంలో మహిళలు తిలకం దిద్ది ,హారతులు పట్టి,
పూలమాలలతో స్వాగతించారు.తోపుచర్లలో ఎన్నికల తొలి ప్రచారంలో
కమ్యూనిస్టులకు పూర్వ వైభవం వచ్చింది. డప్పు వాయిద్యాలతో కోలాటాలతో ఉత్సాహంగా ప్రచారం సాగింది.

                ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ తెలంగాణలో 19 సీట్లు కమ్యూనిస్టు పార్టీ పోటీ చేస్తుందని దానిలో ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి రంగన్న గెలిచి తీరుతాడని కేంద్ర కమిటీ విశ్వాసం వ్యక్తం చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బిఆర్ఎస్ పార్టీ విధానం మీద, ప్రజల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి రంగన్న అన్నారు. నియోజకవర్గంలో ఏం చేయడానికి బిఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

            మళ్ళీ గెలిచి మరొక 1000 కోట్లు సంపాదించడానికి బరిలో నిలిచారన్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రంగన్న గెలిచినట్లయితే వారు సంపాదించిన కోట్లను కక్కించి ప్రజలకు పంచుతార న్నారు. కాంగ్రెస్ కు చరిత్ర ఏముందని.. గతంలో కాంగ్రెస్ లేదా అప్పుడేం చేసిందని ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి సేవా ముసుగులో వ్యాపారం చేయడానికి సిద్ధమై ఎన్నికల్లో నిలిచారన్నారు. బిజెపి ప్రమాదం కోసం కలిసి పోటీ చేద్దామని పొత్తు పెట్టుకుంటే అహంకారంతో విర్రవీగి దూరం చేసుకున్నారన్నారు.

         బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పేరుతో మళ్లీ దొరల పాలన, గడి పాలన సాగించడానికి సిద్ధమయ్యారన్నారు. డబ్బు సంచులు,కాంట్రాక్టర్లు ,ఒకవైపున ప్రజల మనిషి రంగన్న మరోవైపున ఉన్నారని ప్రజలే ఆలోచించి తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజల నాయకున్ని ఎన్నుకోవాలి అన్నారు. 50 సంవత్సరాలుగా ఎర్రజెండ నీడలో ప్రజా పోరాటాలు చేసి జైలుకెళ్ళిన వ్యక్తి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేశారన్నారు.
               బిఆర్ఎస్ పార్టీ మతోన్మాదానికి లోంగి మాట మార్చింది అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చట్ట సభల్లో వెనుక బెంచ్ లో కూర్చున్న వారికి ,సమస్యలపై ప్రశ్నించే దమ్ము లేని వారికి ఎమ్మెల్యే పట్టం కట్ట వద్దన్నారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, పోరాటనాయకుని, ప్రజల నాయకుల్ని ఎన్నుకుంటారని అన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో వాగ్దానాలు చేసి అమలు చేయలేదన్నారు. దళిత బంధు, బీసీ బందు, రైతుబంధు కార్యక్రమాలు పెట్టి అసలుకే బందు పెట్టారన్నారు.
                       ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీకి పూర్వవైభం వచ్చిందని కమ్యూనిస్టు కోసం ప్రజలు తహతలాడుతున్నారని అన్నారు. పోరాట పటిమగల నాయకుడు జూలకంటి అని పోరాట శక్తి గల పార్టీ సిపిఎం అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమా మాట్లాడుతూ సేవ పేరుతో నియోజకవర్గాన్ని దోచుకునే మనిషి కావాలో బ్రతుకు బరోసానిచ్చే రంగన్న కావాలొ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.   
                    డబ్బు సంచులు, పెట్టుబడిదారులు,  దళారులు, దందాకారులు, ఒకపక్క ప్రజల మనిషి రంగన్న మరో పక్క అని ఎవరు కావాలో ప్రజల నిర్ణయిస్తారు అన్నారు. 50 సంవత్సరాలుగా పోరాటమే మార్గంగా ఎంచుకొని నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి రంగన్న అన్నారు. మోడీ పాలనలో రైతు వ్యతిరేక చట్టాల కోసం పోరాడిన వ్యక్తి అని రైతంగం మొత్తం మద్దతు ఇవ్వాలని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజల మనిషి రంగన్నకు మద్దతించి గెలిపించాలని కోరారు.
       
           ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌతమ్ రెడ్డి ,డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పాదురు శశిధర్ రెడ్డి, గోవర్ధన ,రోండి శ్రీనివాస్, పాల్వాయి రామ్ రెడ్డి, రెమిడీల పరశురాములు, పోలబోయిన వరలక్ష్మి, రవి నాయక్ ,వడ్డగాని సైదులు , శీలం బిక్షం, రెమిడీల బిక్షం,తదితరులు పాల్గొన్నారు.
Comments