రుద్రవరం మండల కేంద్రం లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

Rathnakar Darshanala
ఆంధ్రప్రదేశ్ నేటి వార్త :
రుద్రవరం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.

* ప్రభుత్వo ప్రకటించినమద్దతు ధరకు కొనుగోలు చేయాలి

* మధ్య దళారుల దోపిడీ నుండి రైతాంగాన్ని ఆదుకోవాలి
.
* పాలకుల నిర్లక్ష్యం, పకృతి శాపం వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని కాపాడాలి 

* ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్.

ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రుద్రవరం, సిరివెళ్ల ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో రైతాంగం మొక్కజొన్న కటింగ్ ను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు గురువారం నాడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మహాదేవపురం కోటకొండ, కె కొత్తూరు , ఎల్లా వత్తుల  శ్రీరంగాపురం, పెద్ద కమ్మలూరు అప్పనపల్లె గ్రామాల్లో మొక్కజొన్న లు ఆరబెట్టిన కల్లాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతాంగంతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న వేసినప్పటినుండి మొలక దశలో అధిక వర్షాలు కురిసాయి. పంట కంకి దశలో సరైన వర్షాలు కురవలేదు. ఒక్కొక్క ఎకరాకు సుమారు 40 వేల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టాం. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వచ్చినది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారస్తులు  కల్లాల వద్దకు వచ్చి కింటా కేవలం 1900 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వారం పది రోజుల తర్వాత డబ్బులు ఇస్తామంటున్నారు.

రోజు బాగా ఎండ ఉన్నది అని  రోడ్ల వెంట గింజలు ఆరబోస్తే  బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు విపరీతంగా వచ్చి కొంత మేర వర్షం కురసి మొక్కజొన్న గింజలు తడిసి పోయాయిఎప్పుడు వర్షం వస్తుందో గింజలు తడిసిపోతాయో  అన్న భయంతో కాలం వెల్ల  తీస్తున్నామన్నారు.  -

 - ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారులు మా వద్దకు వచ్చి  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు  మేము విత్తనాలు కొనుగోలు చేస్తామని   చెప్పడం లేదు. ఆర్ బి కే కేంద్రాల్లో పంట నమోదు చేసుకున్న కూడా  కొనుగోలు చేయుటకు వ్యవసాయ అధికారులు ఇప్పటివరకు రాలేదు అని రైతులు తమ గోడు విన్నవించుకున్నారు.
 ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రామచంద్రుడు మాట్లాడుతూ విత్తనం వేసేటప్పుడు నుండి పంట అమ్ముకునే వరకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వెంట రైతాంగం గింజల వద్ద కాపలా కాస్తుంటే  కనీసం మేమున్నాము మీ గింజలు కొనుగోలు చేయిస్తాము అని చెప్పడానికి ముందుకు రావడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం గతంలో మొక్కజొన్న కొనుగోలుకు క్వింటాలుకు 1960 నుండి 2090 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించింది అన్నారు  ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర జీవోలు పేపర్లు నలగకుండాఉన్నాయి కానీ వాటి అమలు మాత్రం జరగడం లేదు.

 కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, తక్షణమే రుద్రవరం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి  మండలంలో ఉన్న రైతులందరి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  వెంటనే జోక్యం చేసుకొని తాలూకాలోని రైతాంగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, మధ్య దళారుల దోపిడీ నుండి ఆళ్లగడ్డ తాలూకా రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని ప్రకటన ద్వారా కోరారు.

 మద్దతు ధర అమలు కోసం రైతులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం ద్వారా సాధించుకునేందుకు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన  మార్క్ఫెడ్  మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరుగుతుందని  రైతులందరూ పాల్గొనవలసిందిగా కోరారు.
Comments