పత్తి కొనుగోళను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

Rathnakar Darshanala
పత్తి కొనుగోళను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
ఆదిలాబాద్ నేటి వార్త :
దేశంలోనే ఆదిలాబాద్ పత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. తొలుత పత్తి వేలంపాటలో రైతులు, ట్రేడర్లు, అధికారులు పాల్గొని మద్దతు ధర 7020 /- వరకు ధరను నిర్ణయించారు.

           అనంతరం కలెక్టర్ కాంటకు పూజలు నిర్వహించి, రైతులను సన్మానించి తూకం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులు పండించే పత్తి నాణ్యమైనదని, దేశంలోనే మన జిల్లా పత్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ అధికంగా ఉంటుందని, 8 నుంచి 12 శాతం తేమతో ట్రేడర్లు 7100/- రూపాయలకు కొనుగోళుకు ముందుకు వచ్చారన్నారు.
        పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అవసరమైన మార్కెట్, రెవెన్యూ సిబ్బంది నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, రైతు సంఘాల నాయకులు, ట్రేడర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comments