ప్రభుత్వ హాస్టల్ లో అస్వస్థకు గురైన విద్యార్థులు.

Rathnakar Darshanala
ప్రభుత్వ హాస్టల్ లో అస్వస్థకు గురైన విద్యార్థులు.
 విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ బి ఏం సంతోష్

 నేటి వార్త :అల్లంపూర్ తాలూకా ప్రతినిధి నవంబర్ 1 

అలంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసి బాలుర పాఠశాల విద్యార్థులు శుక్రవారం రాత్రి‌ అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది. కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి.  చికిత్స కోసం వెంటనే గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. 

కలుషిత ఆహార ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

తమ పిల్లల ఆక్రందనలు చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పేద విద్యార్థులంటే అంత చులకనా అంటూ హాస్టల్ వార్డెన్ పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
Comments