ఆదిలాబాద్‌ లో భారీ భూ మాఫియా కుంభకోణం. భూ మాఫియాకు వణుకు పుట్టిస్తున్న జిల్లా పోలీస్ లు.

Rathnakar Darshanala
ఆదిలాబాద్‌ లో భారీ భూ మాఫియా కుంభకోణం.
* మావల పోలీస్‌ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్.

* మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం బట్టబయలు అయింది.

నేటి వార్త ఆదిలాబాద్ :ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను మావల పోలీసులు బట్టబయలు చేశారు.

 అరెస్టైన నిందితులు:

* నానం వెంకటరమణ (60) – RWS D.E.E., టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్
* ఉష్కం @ ఉష్క మల్ల రఘుపతి (43) – మావల, ఆదిలాబాద్
* బెజ్జవార్ సంజీవ్‌కుమార్ (49) – ప్రభుత్వ ఉద్యోగి, ఆయుష్ విభాగం, రిమ్స్ ఆదిలాబాద్

 పరారీలో ఉన్నవారు:

 దుప్పలపూడి అశోక్ – సబ్ రిజిస్ట్రార్

* కుంభకోణం ఎలా జరిగిందంటే..?

బాధితుడు మిల్లింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది.

నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు.

సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు ₹7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు.

సుమారు ₹2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ.


 నమోదు చేసిన సెక్షన్లు: IPC 447, 427, 420, 467, 468, 471, 120-B

 మావల సీఐ కర్ర స్వామి దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులు అరెస్ట్. పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments