Ap :జర్నలిస్టు ల పై దాడి సరైనది కాదు.సీఎం చంద్రబాబు నాయుడు.
By
Rathnakar Darshanala
జర్నలిస్టు ల పై దాడి సరైనది కాదు.సీఎం చంద్రబాబు నాయుడు.
నేటి వార్త డెస్క్ :చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .
విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కు వెళ్లిన ఫోటోగ్రాఫర్ పై తీవ్ర స్థాయిలో దాడిచేసి గాయపరచడం అమానుషం. ప్రస్తుతం చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు .
ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు .శివకుమార్ కు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామన్నారు,
.నాయకుల ప్రోద్భలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగింది. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారూ.
మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.జర్నలిస్ట్ ల పైన దాడి చేసిన వారిని క్షమించేది లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Comments