యువత సేవాభావం అలవర్చుకోవాలి.: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
By
Rathnakar Darshanala
యువత సేవాభావం అలవర్చుకోవాలి.
: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 18: రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు.
ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్, టైలరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ,యువకులతో ఎమ్మెల్యే ముచ్చటించారు.
అవకాశాలను వినియోగించుకుంటూ,వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటూ యువత సేవాభావాన్ని అలవర్చుకుంటే,వారు ప్రగతి పథంలో దూసుకెళ్లి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారని అన్నారు.
శిక్షణ కేంద్రంలో నీటి సమస్యపై సిబ్బంది అవగాహన కల్పించగా,వెంటనే బోరు వెల్ మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అదేవిధంగా, ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు,
ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్,చిరంజీవి, వనిత,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments