శిల్పరామంలో సాంస్కృతిక కార్యక్రమాలు.

Rathnakar Darshanala
శిల్పరామంలో  సాంస్కృతిక కార్యక్రమాలు.
నేటివార్త, శేరిలింగంపల్లి:

శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  దుబాయ్ లో  తన్మయి ఆర్ట్ స్టూడియో ని నెలకొల్పి ఎందరికో భారతీయులకి, విదేశీయులకి కూచిపూడి నృత్యం లో శిక్షణ ఇస్తున్న నాట్యగురువులు  ప్రీతీ తాతంభొట్ల,

దుబాయ్ లో  కూచిపూడి నృత్యం లో శిక్షణ తీసుకుంటున్న  శిష్యులు కుమారి రామాస, లక్ష్మి , మనోజ్ఞ, ప్రవళిక, వైష్ణవి, వీక్షితాః, హ్యాంవిత, లాలనశ్రీ, సాన్విరెడ్డి, శ్రీ ప్రాంజల్, అమృత ప్రవళిక, శ్రీ ప్రణవిలు శనివారం శిల్పారామం లో చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. 

గణేశా పంచరత్న, రామాయణ శబ్దం, స్వాగతం కృష్ణ, అంబాష్టకం, బాలకనకమయ, నంద నందన గోపాల, భోశంభో మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
Comments