సిఅర్ అర్ సేవలు మరువలేనివి.నివాళులు అర్పించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

Rathnakar Darshanala
సిఅర్ అర్ సేవలు మరువలేనివి.నివాళులు అర్పించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
ఆదిలాబాద్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత సీఆర్ఆర్ 

- తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి 
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :
మాజీ మంత్రివర్యులు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరిచిపోలేని మహానేత దివంగత చిలుకూరి రామచంద్రా రెడ్డి గారి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో నిర్వహించారు. 

బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఆర్ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు చేసిన సేవలను కొనియాడుతూ జోహార్ సీఆర్ఆర్ అంటూ నినాదాలు చేసారు. 

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేసి, తన చివరి క్షణం వరకు ఆదిలాబాద్ ప్రజల బాగోగులకోసమే పనిచేసిన వ్యక్తి సీఆర్ఆర్ గారు అని అన్నారు. 

ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులని క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులను తయారుచేసిన ఆయనకు సదా రుణపడి ఉంటామని అన్నారు.

 తన హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఆ మహానేత మనమధ్య లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. 
వారు చూపిన మార్గంలో నడుస్తూ ప్రతీ ఒక్కరు వారి ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో  మావల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, సిరికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఇమామ్, 

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, మైనారిటీ టౌన్ వైస్ అధ్యక్షులు  sk అలీం, NSUI మండల అధ్యక్షులు మరసకోల గౌతమ్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, కుదురుపాక సురేష్, బండి చారి, 

విజయ్, మాధవ్ సమీ ఉల్లాఖాన్ , ఆఫ్సార్ ఖాన్, మాధవ్ పటేల్, MD ఆఫ్సర్,  షేక్ రహీమ్, అజిజ్ , మహేందర్, బాలకృష్ణ, వెంకటేష్, రెండ్ల రాజన్న, లస్మన్న, నవీన్, దినేష్, అక్షయ్, దత్తు, అన్నం సంటేన్న, ఫెరోజ్ ఖాన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments