పేకాట రాయుళ్లపై కేసు నమోదు.
By
Rathnakar Darshanala
పేకాట రాయుళ్లపై కేసు నమోదు.
*- కారేపల్లి ఎస్ఐ బైరు గోపి..*
నేటివార్త,సింగరేణి (జులై 27):
సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు జరిపిన దాడిలో ఆరు మోటార్ బైకులు 9 సెల్ ఫోన్లు తోపాటు నగదు పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కారేపల్లి ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ సమీపంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసరాల్లో పేకాట స్థావరంపై దాడి చేశారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇల్లందుకు చెందిన 12 మంది వ్యక్తులు పేకాడుతూ దొరికారు.వారి వద్ద నుండి 6 మోటార్ సైకిళ్ళు 9 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా 26 వేల 900 నగదు పట్టుకున్నారు.దీనికి సంబంధించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.గోపి తెలిపారు.ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు భూక్య శంకర్, హరి, ఓంకార్,సైదులు తదితరులు ఉన్నారు.
Comments