జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.
By
Rathnakar Darshanala
జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
నేటివార్త నవంబర్ 24 గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి (దొంగ మల్లన్న)జాతర ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
నవంబర్ 26 నుండి డిసెంబర్ 17 వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్,సి.ఐ రవి,స్థానిక ఎస్.ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ బీమా సంతోష్ ,ఆలయ ఈ వో విక్రమ్ ,ఫౌండర్ శాంతయ్య ,కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
Comments