కోట్లనర్సింహులపల్లి లో వృద్ధ మహిళపై పుస్తెళతాడు దొంగతనం.

Rathnakar Darshanala
కోట్లనర్సింహులపల్లి లో వృద్ధ మహిళపై పుస్తెళతాడు దొంగతనం.
నేటివార్త నవంబర్3 గంగాధర రిపోర్టర్ (జంగిలి మహేందర్)

 గంగాధర మండలం, కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేముజాల సత్తమ్మ భర్త భూమయ్య, కులం: మున్నూరుకాపు, 

తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటలకి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు వచ్చి “అమ్మా అమ్మా, తలుపు తెరువు” అని పిలిచాడు. భయంతో తలుపు తీయకపోవడంతో ఆ వ్యక్తి బలంగా తలుపులు కొట్టడంతో తలుపు గడి దెబ్బతిని తెరుచుకుంది.
తరువాత ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి, బాధితురాలి మెడలో ఉన్న సుమారు 2½ తులాల బరువైన పుస్తెల తాడు మరియు పుస్తెలను కత్తిరించి దొంగలించుకుపోయాడు అనంతరం తలుపు బయట నుండి గడియ పెట్టి పారిపోయాడు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, గంగాధర ఎస్‌.ఐ.  వంశీ కృష్ణ  కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Comments